Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంపీ మంత్రిపై కంగనా హెచ్చరిక : ఎముకలు విరగ్గొడతానటూ వార్నింగ్

Advertiesment
Kangana Ranaut
, ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (12:21 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి సుఖ్‌దేవ్ పన్సేపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గట్టి వార్నింగ్ మండిపడ్డారు. ఎముకలు విరగ్గొడతానని వార్నింగ్ ఇచ్చారు. తానేమీ వయ్యారాలు వలికించే యువతిని కాదని, రాజపుత్ వంశానికి చెందినదాన్నని ఘాటైన సమాధానం ఇచ్చారు. ఇంతకీ వారిద్దరి మధ్యా ఏం జరిగింది? అంత ఘాటుగా కంగనా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే, కొన్ని రోజుల క్రితం సుఖ్ దేవ్ ఏమన్నారో తెలుసుకోవాలి.
 
ఇటీవల మీడియాతో మాట్లాడిన సుఖ్ దేవ్, కంగన గురించి మాట్లాడుతూ, ఆమె ఓ రికార్డింగ్ డ్యాన్సర్ అనే మీనింగ్ వచ్చేలా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో కంగన స్పందించారు. 
 
తానేమీ ఆలియా భట్, దీపికా వంటి హీరోయిన్ ను కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఇంతవరకూ ఏ సినిమాలోనూ ఐటమ్ సాంగ్స్ చేయలేదని, ఐటమ్ సాంగ్స్ చేయని ఏకైక హీరోయిన్ ను తానేనని అన్నారు.
 
గతంలో ఎన్నో పెద్ద పెద్ద హీరోల సినిమాలను కూడా వద్దనుకున్నానని, అందుకనే బాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరో హీరోయిన్లు, ఇతర నటీ నటులు తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా కంట్లో కన్నీరు ఇంకిపోయింది.. తీసుకెళ్లమని దేవుడిని ప్రార్థించా... సంజనా గల్రానీ