Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేరొక వ్యక్తితో కాపురం.. భార్య భుజాలపై అలా చేసి.. కర్రలతో కొడుతూ..

వేరొక వ్యక్తితో కాపురం.. భార్య భుజాలపై అలా చేసి.. కర్రలతో కొడుతూ..
, మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (15:19 IST)
భర్తతో విడిపోయి వేరొక వ్యక్తితో కలిసి జీవిస్తున్న కారణంగా మహిళపై ఆమె భర్త అనాగరికంగా వ్యవహరించాడు. గిరిజనురాలైన ఆమె భుజాలపై భర్త కుటుంబసభ్యుడిని కూర్చోబెట్టి 3 కిలోమీటర్ల వరకు బలవంతంగా నడిపించాడు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. భర్త కుటుంబానికి చెందిన కొందరు యువకులు మహిళ వెనక ఉండి.. ఆమె వేగం తగ్గినప్పుడల్లా పాశవికంగా కర్రలతో కొట్టారు. ఈ దారుణం సాగై-బాన్స్‌ఖేడీ గ్రామాల మధ్య జరిగినట్లు తెలిసింది. మహిళ ఫిర్యాదు మేరకు నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
భర్త అంగీకారంతోనే తాను విడిపోయినట్లు, ఇప్పుడు వేరే యువకుడితో సహజీవనం చేస్తున్నట్లు సదరు మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్షాలు రావొద్దని కోరుకున్న మేయర్ ఎవరు?