Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితురాలిపై అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేసిన కిరాతకులు

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (14:33 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు కామాంధులు తమ స్నేహితురాలిపై అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేశారు. పైగా, ఈ విషయాన్న చెబితే ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించారు. అప్పటి నుంచి గత యేడాదిగా ఆమెను బలవంతంగా అనుభవిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ యువతికి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. దీంతో అత్యాచార వీడియోను సదరు వ్యక్తికి పంపించడంతో పెళ్లి రద్దు అయింది. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా, 2021 జూన్ 2వ తేదీన హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలిపారు. 
 
ఈ విషయం గురించి బయటకు చెపితే తన తండ్రిని, సోదరుడిని చంపేస్తామని బెదిరించారని, దీంతో బాధితురాలు కొన్ని నెలలుగా మౌనంగా ఉన్నట్టు విచారణరో వెల్లడైంది. ప్రస్తుతం ఈ కేసులోని నిందితులు పరారీలో ఉండగా, వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments