Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకుపై తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లిన కుమారుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (13:55 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బట్టబయలైంది. ఇటీవలే సాగర్‌లో ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన కలకలం రేపిన విషయం తెల్సిందే. తాజాగా మరో అమానవీయ ఘటన జరిగింది. 
 
ఈ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చనిపోయిన తల్లి మృతదేహాన్ని కన్నబిడ్డ తన బైకుపై కట్టి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామానికి తరలించారు. తల్లి మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో తరలించేందుకు రూ.5 వేలు డిమాండ్ చేశారు. అంత మొత్తం డబ్బులు చెల్లించలేని ఆ యువకుడు.. చివరకు తన బైకునే మార్చురీ అంబులెన్స్‌గా చేసుకుని తల్లి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. 
 
ఇందుకోసం రూ.100 చెల్లించి ఓ చెక్క పలకలు కొని, దానిపై తల్లి మృతదేహాన్ని పడుకోబెట్టి, దాన్ని మోటార్ సైకిల్‌కు కట్టి తీసుకెళ్లారు. ఈ హృదయ విదారక దృశ్యాలను చూసిన కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడిటాలో షేర్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

షారూక్‌ ఖాన్‌ను ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు? నటి ఊర్వశి ప్రశ్న

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments