Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టమోటా కలిపిన మ్యాగీ తిని ముంబై మహిళ మృతి

Noodles
, శనివారం, 30 జులై 2022 (23:03 IST)
ముంబైకి చెందిన ఓ మహిళ మ్యాగీ న్యూడుల్స్‌కి టమోటా కలిపి టేస్ట్ చేసింది. అంతే ప్రాణాలు కోల్పోయింది. ఇదేంటి మ్యాగీలో టమోటా కలిపి తింటే చనిపోతారా అనుకునేరు. 
 
అసలు విషయం ఏంటంటే మృతురాలు ఎలుకను చంపేందుకు టోమాటోలో విషం పెట్టింది. ఈ విషయాన్ని మరిచి అదే టొమాటోను మ్యాగీలో వేసి వండింది. ఇది తిని చనిపోయింది.
 
ముంబైకి చెందిన 27 ఏళ్ల రేఖ అనే మహిళ.. మ్యాగీని తయారు చేస్తుండగా, ఎలుకలు విషం పెట్టిన టొమాటోను పొరపాటున మ్యాగీలో వేసి వండింది. ఈ ఘటన ముంబైలోని మలాడ్ లోని పాస్కల్ వాడి ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
మరుసటి రోజు మ్యాగీ న్యూడిల్స్ తయారు చేసే క్రమంలో.. టీవీ చూస్తూ ఎలుకల విషం పెట్టిన సంగతి మరిచి అదే టొమాటోను మ్యాగీలో వేసింది. దీంతో మ్యాగీని తిన్న సదరు మహిళకు కొన్ని గంటల్లోనే వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. 
 
ఆమె భర్త, బావ సమీప ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. ప్రమాదవశాత్తు విషం కలిసిన టొమాటోను మ్యాగీలో కలపడం వల్లే మరణించిందని.. మాల్వాని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిగ్గు సిగ్గు.. మహిళా కానిస్టేబుల్ కోసం రోడ్డుపైనే కొట్టుకున్న ఖాకీలు