Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి బెడ్‌పై భర్త మృతి - గర్భిణి భార్యతో బెడ్ కడిగించిన వైద్యులు (Video)

ఠాగూర్
ఆదివారం, 3 నవంబరు 2024 (12:19 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి ఆస్పత్రి బెడ్‌పైనే చనిపోయాడు. దీంతో అతని భార్య పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అయితే, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అత్యంత హీనంగా ప్రవర్తించారు. భర్తను కోల్పోయి బోరున విలపిస్తున్న భార్యతో భర్త ప్రాణాలు విడిచిన బెడ్‌ను శుభ్రం చేయించారు. పైగా, ఆ మహిళ ఐదు నెలల గర్భిణి కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. 
 
దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఆ రాష్ట్ర వైద్య శాఖ అధికారులు డాక్టర్, ఇద్దరు నర్సులపై సస్పెన్షన్ వేటు వేయగా, మిగిలిన సిబ్బందికి నోటీసులు జారీచేసింది. ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్‌ను బదిలీ చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని డిండౌరీ జిల్లా గర్ణాసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అక్టోబరు 31వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని గిరిజన గ్రామమైన లాల్పూర్‌లో గురువారం ఓ భూవివాదానికి సంబంధించి నలుగురు వ్యక్తులపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో తండ్రి, ఓ కుమారుడు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా అదే రోజు శివరాజ్ మరావి (40) అనే వ్యక్తి మరణించాడు. దీంతో బెడ్‌పై ఉన్న రక్తపు మరకలను ఆసుపత్రి సిబ్బంది.. గర్భిణి అయిన ఆయన భార్యతో కడిగించారు.
 
అసలే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెతో బెడను కడిగించడం వివాదాస్పదమైంది. ఆమె బెడ్ కడుగుతున్న వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. వైద్యుడు, ఇద్దరు నర్సులను సస్పెండ్ చేశారు. మిగతా సిబ్బందికి నోటీసులు జారీచేశారు. ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ సింగ్‌ను కరంజియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు బదిలీ చేసింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments