Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కోడలు ఆత్మహత్య.. కారణం ఏంటి?

Webdunia
బుధవారం, 11 మే 2022 (17:56 IST)
మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇంటి కోడలు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.  విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ కోడలు సవిత పర్మార్(23) ఆత్మహత్యకు పాల్పడింది. 
 
షాజాపుర్​ జిల్లా పొంచానేర్​ గ్రామంలోని తన నివాసంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మంగళవారం సాయంత్రం సవిత పర్మార్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతదేహానికి సమీపంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
వివరాల్లోకి వెళితే.. సవిత పర్మార్ (22) మూడు సంవత్సరాల క్రితం ఇందర్ సింగ్ పర్మార్ కుమారుడు దేవరాజ్ సింగ్‌‌ను వివాహం చేసుకున్నారు. 
 
మంగళవారం సవిత ఆత్మహత్య సమయంలో, ఇందర్ సింగ్ పర్మార్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఉండగా, సవిత భర్త దేవరాజ్ సింగ్ ప్రక్కనే ఉన్న గ్రామమైన మొహమ్మద్ ఖేరాలో ఒక వివాహానికి హాజరైనట్లు సమాచారం. ఇంట్లో ఇతర బంధువులు ఉన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments