Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువ ఐఏఎస్‌కు కరోనా వైరస్.. సెల్ఫ్ క్వారంటైన్‌కు కొలీగ్స్

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (10:43 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. కరోనా వైరస్ బారినపడిన వారికి సేవలు చేస్తున్న ఓ యువ ఐఏఎస్ అధికారిని కాటేసింది. దీంతో ఆయనతో పాటు ఉండే కార్యాలయ సిబ్బందితో పాటు కొలీగ్స్ అంతా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఓ యువ ఐఏఎస్ అధికారి పనిచేస్తున్నారు. ఈయన కరోనా రోగులకు వైద్య సేవలు చేయించే పనుల్లో తీవ్రంగా నిమగ్నమయ్యారు. అయితే, ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 
 
అంతేకాకుండా, ఆయనతో సన్నిహితంగా మెలిగిన సహోద్యోగులు, కుటుంబ సభ్యులు కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. వీరిలో రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రం ఆరోగ్య శాఖకు చెందిన 120 మంది అధికారులు, సిబ్బంది నుంచి నమూనాలు సేకరించి కోవిడ్-19 పరీక్షల కోసం పంపినట్టు ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments