Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మధ్యప్రదేశ్‌' సంక్షోభం.. సింధియా తిరుగుబాటు.. కమలనాథ్‌కు గండం

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (10:25 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తన వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలతో ఆయన అదృశ్యమయ్యారు. ఈయన మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. 
 
మరోవైపు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించేందుకు ముఖ్యమంత్రి కమల్‌నాథ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌లు రంగంలోకి దిగారు. ఇందులోభాగంగా, అసంతృప్తులను బుజ్జగించేందుకు మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీరికరించారని నిర్ణయించారు. ఫలితంగా 20 మంది మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. 
 
ఫలితంగా, కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దినదినగండంగా కొనసాగుతోంది. తాజా పరిణామాలతో కమల్‌నాథ్‌కు పదవీ గండం పొంచి ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తున్నది. మరోవైపు, ఇటీవల సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన కనిపించకుండా పోయిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు తిరిగిరాగా.. మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రావాల్సి ఉన్నది. 
 
మరోవైపు, అధికార పార్టీలో మొదలైన సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తున్నది. బీజేపీ సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులను వివరించారు. 
 
బీజేపీ నేతలు మంగళవారం గవర్నర్‌ను కలుస్తారని సమాచారం. మొత్తంమీద మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించి, దాన్ని తమవశం చేసుకునేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నారంటూ విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lakshmi Manchu: కళను రాజకీయం చేయవద్దు... మంచు లక్ష్మీ కామెంట్స్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments