Webdunia - Bharat's app for daily news and videos

Install App

జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

ఠాగూర్
సోమవారం, 10 మార్చి 2025 (10:00 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఎంహౌలోని జామా మసీదు ప్రాంతంలో ఆదివారం రాత్రి అల్లర్లు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులతో పాటు ఆర్మీ బలగాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ పోటీల్లో భారత్ విజయం సాధించింది. 
 
ఈ విజయం తర్వాత భారత్‌లోని పలు ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు ఎంహౌలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జామా మసీదుగా సాగింది. మసీదు ప్రాంతం నుంచి వెళుతుండగా సమీపంలోని గుంపు ర్యాలీపై రాళ్లు విసిరింది. ఇది రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. ఈ సందర్భంగా పలు వాహనాలు ధ్వంసం చేశారు. రెండు దుకాణాలు, రెండు వాహనాలకు దుండగులు నిప్పుపెట్టారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్మీ సిబ్బంది కూడా అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గొడవ జరిగిన ప్రాంతం కంటోన్మెంట్ ఏరియా కావడంతో ప్రత్యేకంగా ఆర్మీ సిబ్బందిని మొహరించాల్సిన అవసరం లేకుండా పోయింది. కాగా, ఈ ఘర్షణల్లో ముగ్గురు గాయపడ్డారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments