Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం - 22 మంది దుర్మరణం

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (12:43 IST)
దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మూడు రోజులుగా ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం మహారాష్ట్రలో జరిగింది. మంగళవారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ తాజా రోడ్డు ప్రమాదంలో 22 మంది మృత్యువాతపడ్డారు. 
 
సిధి జిల్లా ప‌ట్నా మీదుగా ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఓ బ‌స్సు అదుపుత‌ప్పి కాల్వ‌లో ప‌డింది. ఆ స‌మ‌యంలో బ‌స్సులో దాదాపు 54 మంది ప్రయాణికులు ఉన్నారు. బ‌స్సు కాల్వ‌లో ప‌డిన అనంత‌రం ఏడుగురు ప్ర‌యాణికులు సుర‌క్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
 
మిగతా వారంతా కాల్వ‌లోనే ఉండిపోయారు. వారిని బ‌య‌ట‌కు తీసేందుకు స‌హాయ‌క బృందాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ ప్రమాద ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. కాల్వ‌లో బ‌స్సు ప‌డిపోయింద‌న్న ఘ‌ట‌న తెలుసుకున్న స్థానికులు వంద‌లాది మంది అక్క‌డ‌కు త‌ర‌లివ‌చ్చారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments