Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైన్యం కొత్త అధ్యక్షుడుగా మనోజా పాండే

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (14:53 IST)
భారత కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెట్ జనరల్ మనోజ్ పాండే నియమితులు కాగా, ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సైన్యాధ్యక్షుడి బాధ్యతలను ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే అప్పగించారు. ఇప్పటివరకు జనరల్ మనోజ్ పాండే భారత ఆర్మీ ఉప చీఫ్‌గా పనిచేశారు. ఎంఎం నరవణే పదవీకాలం ముగియడంతో ఆయనకు పదోన్నతి కల్పించారు. 
 
కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ విభాగం నుంచి ఆర్మీ చీఫ్ అయిన తొలి అధికారిగా జనరల్ మనోజ్ పాండే చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. గతంలో ఈ విభాగం నుంచి వైస్ చీఫ్ స్థానం వరకే రాగలిగారు. 1962 మే 6న జన్మించిన పాండే.. ఆర్మీకి 29వ అధిపతిగా పనిచేయనున్నారు. 62 ఏళ్ల వరకు లేదంటే మూడేళ్లు ఈ రెండింటిలో ఏది ముందే అయితే అప్పుటివరకు పదవిలో కొనసాగుతారని కేంద్రం వెల్లడించింది. 
 
కాగా, భారత్ పలు సవాళ్లను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టారు. ఆర్మీ వైస్ చీఫ్ పదవిని మే 1న బీఎస్ రాజు చేపట్టనున్నారు. ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్‌‌గా ప్రస్తుతం రాజు పనిచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments