Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. పెళ్లై పిల్లలున్నా ''లవ్'' చిగురించింది..

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (11:06 IST)
ప్రేమకు కళ్లు లేవు గుడ్డిది అంటారు. అయితే కళ్లు మాత్రమే కాదు వయసుతో కూడా సంబంధం లేదని.. ఈ జంట నిరూపించారు. వివాహమైనా... ఇద్దరు పిల్లలు కలిగినా.. ఆపై వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. కానీ ఆ ప్రేమకు సమాజం అక్రమ సంబంధం అని పేరు పెట్టడంతో పాటు.. నానా రకాలుగా మాటలతో దెప్పిపొడిచింది. చివరికి తమ ప్రేమను బతికించుకునేందుకు ఆ ఇద్దరు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవసరి జిల్లా బిలిమొర ప్రాంతానికి దగ్గర్లో ఉన్న సురిబుజర్గలో 25 ఏళ్ల రంజిత్ జుగ తన కుటుంబంతో అమ్లాసద్ సొసైటీలో నివసిస్తున్నాడు. ఇదే సొసైటీలో స్వాతి భాలియా అనే మరో మహిళ కూడా భర్తతో కలిసి నివసిస్తుంది. రంజిత్, స్వాతిలకు ఇప్పటికే వివాహమైంది. ఇద్దరికీ పిల్లలున్నారు. 
 
ఈ నేపథ్యంలో రంజిత్, స్వాతి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పదినెలలుగా వీరిద్దరి మధ్య నడుస్తున్న ప్రేమాయాణం గురించి సొసైటీ మొత్తం తెలిసిపోయింది. అయితే ఇంట్లో వారు వారిద్దరికీ షరతులు పెట్టారు. 
 
కలుసుకోకూడదంటూ నిబంధనలు పెట్టారు. అయినా వారిద్దరి మధ్య ప్రేమ చెరిగిపోలేదు. చివరికి సమాజం మాత్రం వీరి ప్రేమను అర్థం చేసుకోలేదని మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments