శుక్రవారమే అవిశ్వాసం.. మోదీ సర్కారు రె ''ఢీ''..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో సమావేశాలు ప్రారంభం కాగానే.. కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది. ఈ తీర్మానాన్ని స్పీకర్‌ కూడా ఆమ

Webdunia
బుధవారం, 18 జులై 2018 (14:25 IST)
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో సమావేశాలు ప్రారంభం కాగానే.. కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది. ఈ తీర్మానాన్ని స్పీకర్‌ కూడా ఆమోదించారు. దీంతో టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై కేంద్రం దిగివచ్చినట్లైంది. అంతేగాకుండా మోదీ సర్కారు అవిశ్వాసంపై చర్చకు రెడీ అయ్యింది. 
 
శుక్రవారం నాడు లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ చేపట్టనున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. శుక్రవారం ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేసి, సాయంత్రం వరకు అవిశ్వాసంపై చర్చ జరపనున్నట్టు వెల్లడించింది. చర్చ సందర్భంగా ఏయే పార్టీకి ఎంత సమయం ఇవ్వాలనే విషయాన్ని స్పీకర్ ఖరారు చేయనున్నారు.
 
తమకు నాలుగు గంటల సమయం కావాలని టీడీపీ కోరింది. అయితే, రెండు గంటల సమయం ఇస్తామని, వెసులుబాటును బట్టి సమయాన్ని పెంచే ప్రయత్నం చేస్తామని స్పీకర్ వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా వుంటే సోమవారం నాడు విభజన చట్టంపై రాజ్యసభలో చర్చ సాగనుంది.
 
అంతకుముందు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని తెదేపా ఎంపీ కేశినేని నాని ప్రవేశపెట్టారు. తెదేపా ఎంపీల అవిశ్వాస తీర్మానం అందిందని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించి.. దాన్ని సభ ముందు ఉంచారు. తీర్మానంపై చర్చకు విపక్ష సభ్యులు మద్దతుగా నిలిచారు. 50 మందికిపైగా సభ్యులు మద్దతుగా లేచినిలబడటంతో స్పీకర్‌ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. చర్చ తేదీని శుక్రవారమని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments