Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువనంతపురంలో చేపల వ్యాపారికి కరోనా.. 119 మందికి సోకింది..

Webdunia
గురువారం, 9 జులై 2020 (18:15 IST)
కేరళ తిరువనంతపురంలో కరనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైంది కేరళలోని పుంథూరా, తిరువనంతపురం గ్రామాల నుంచే అని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా కేరళలోని సముద్ర తీర గ్రామం పుంథూరాలో 119 మందికి వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. 
 
ఈ 119 మందికి ఓ చేపల వ్యాపారి ద్వారా కరోనా సోకింది. దీంతో అతడి దగ్గర చేపలు కొన్న వారికి, అతడిని కలిసిన వారికి పరీక్షలు చేసి 119 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. మరికొంత మంది పరీక్షల ఫలితాలు వెలువడాల్సి ఉంది. దీంతో అక్కడికి ఆరు ప్రత్యేక వైద్య బృందాలు చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహిస్తున్నాయి. 
 
పుంథూరా సముద్ర తీర ప్రాంతం కావడంతో అక్కడ నివసిస్తున్న చాలా కుటుంబాలు చేపలు వేటాడి జీవనం సాగిస్తుంటాయి. చేపల విక్రయదారుడికి కరోనా నిర్ధారణ కావడంతో మిగిలిన వారిని కూడా చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ నవజోత్ ఖోసా మత్స్య కారులను ఆదేశించారు. గ్రామం మొత్తం శానిటైజ్ చేయాల్సి ఉందని వైద్య అధికారులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అలసట వల్లే విశాల్‌ స్పృహతప్పి కిందపడిపోయారు : వీఎఫ్ఎఫ్ స్పష్టీకరణ (Video

ఫ్రై డే మూవీలో అమ్మ పాటను ప్రశంసించిన మినిస్టర్ వంగలపూడి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments