Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది నిజంగానే చారిత్రక విజయం : బీజేపీ గెలుపు అద్వానీ

Webdunia
ఆదివారం, 26 మే 2019 (16:15 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎల్కే. అద్వానీ స్పందించారు. ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న అద్వానీ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఎల్కే.అద్వానీ స్పందిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలు చాలా సంతోషంగా ఉన్నాయన్నారు. ఇది నిజంగా చారిత్రక విజయమని అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు చారిత్రాత్మక రీతిలో బీజేపీకి, దాని మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చారన్నారు. ప్రజల తీర్పు పట్ల ఎన్డీయేలోని ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్నారన్నారు. 
 
కాగా, ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం, నరేంద్ర మోడీ నేరుగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకోవడం తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ నేత ఎన్నిక కార్యక్రమంలో కూడా ఇదే సీన్ పునరావృతమైంది. మోడీ మరోసారి బీజేపీ కురువృద్ధుడి దీవెనలు అందుకున్నారు.
 
కాగా, ఈ నెల 23వ తేదీన వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 303 సీట్లు రాగా, ఎన్డీయే కూటమికి 353 సీట్లు వచ్చాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments