Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ - ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భూప్రకంపనలు

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (15:16 IST)
ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవిచాయి. బుధవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించింది. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు సంభవించగా, ఇవి రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. 
 
ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీ - ఎన్సీఆర్‌తో పాటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు కనిపించాయిని అధికారులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రాన్ని ఉత్తరాఖండ్‌ ఫితోరాగఢ్‌లో పది కిలోమీటర్ల లోతన గుర్తించినట్టు వారు తెలిపారు. 
 
అయితే, ఈ  భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ఇదిలావుంటే, బుధవారం ఉదయం పొరుగు దేశమైన నేపాల్‌లో భూకంపం సంభవించింది. దీని ప్రభావం ఉత్తరాఖండ్, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించాయని వారు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments