Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపథ్య గాయకుల రాణి లతా దీదీకి ఎవరికీ అందని రికార్డులు సొంతం

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (11:06 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో 1929 సెప్టెంబరు 28వ తేదీన జన్మించిన నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఇకలేరు. 92 యేళ్ల లతా దీదీ ఆదివారం ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో కన్నుమూశారు. అయితే, ఆమె ఒక గాయనిగా భారత సంగీతానికి 70 యేళ్లపాటు సేవ చేశారు. గాయనిగా ఎవరికీ అందని రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆమె గానం చేసిన పాటలను దేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు. తన పాటలతో దేశ చరిత్రలో లతా మంగేష్కర్ స్థిరస్థాయిగా నిలిచిపోయారు. 
 
లతా దీదీ తల్లిదండ్రులు దీనానాథ్ మందేష్కర్, శుద్ధమతిలకు తొలి సంతానం. భారత గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకున్న ఆమె తెలుగులో అనేక పాటలను ఆలపించారు. 1955లో అక్కినేని నాగేశ్వర రావు సినిమా "సంతానం"లో 'నిదుర పోరా తమ్ముడా' అనే పాటను తొలిసారి ఆలపించారు. 1965లో ఎన్టీఆర్ సినిమా "దొరికితే దొంగలు"లో 'శ్రీ వెంకటేశా' అనే పాటను 1988లో నాగార్జున "అఖరిపోరాటం" సినిమాలో 'తెల్లచీరకు తకదిమి' పాటను ఆలపించారు. 
 
ఈమె 70 యేళ్ల పాటు భారతీయ సినీ సంగీతానికి సేవలు అందించారు. 1948 నుంచి 1978 వరకు దాదాపు 30 వేలకు పైగా పాటలు పాడి, అన్ని పాటలు పాడిన ఏకైక గాయనిగా "గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌" పేరుతో చోటు దక్కించుకున్నారు. అనంతరం 1959లో టైమ్ మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతా మంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించింది. ఆమెను భారతీయ నేపథ్య గాయకులు రాణిగా అభివర్ణించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments