Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు... ఏడుగురు దుర్మరణం

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (09:13 IST)
ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మరణించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పితోర్‌గఢ్‌ జిల్లా జుమా గ్రామంలోని జామ్రి, తర్కోత్‌ ప్రాంతాల్లో కొండ చరియలు కూలిపడి, బురద ప్రవాహం ముంచెత్తింది.

ఇప్పటివరకు మూడు మృత దేహాలను వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి ట్వీట్‌ చేస్తూ గాలింపు చర్యలను ఉధృతం చేయాల్సిందిగా జిల్లా మేజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

గత నాలుగైదు రోజుల నుండి జిల్లాలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. గత వారం జోషి గ్రామంలో రిగిన ఘటనలో యువతి ఆచూకీ తెలియరాలేదు.

మంగళవారం కూడా భారీగా వర్షాలు పడే అవకాశాలు వున్నాయని వాతావరణ విభాగం తెలిపింది. ఈ వర్షాల కారణంగా, రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments