Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాణా కుంభకోణం కేసు: లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ తప్పలేదు. ఈ కేసులో రాంచీ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. బీహార్ రాష్ట్రం దాణా కుంభకోణం నాలుగో కేసుపై విచారణ జరిప

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (12:28 IST)
దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ తప్పలేదు. ఈ కేసులో రాంచీ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. బీహార్ రాష్ట్రం దాణా కుంభకోణం నాలుగో కేసుపై విచారణ జరిపిన కోర్టు లాలూకి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 
 
1995, 1996 సంవత్సరాల్లో దుంకా ట్రెజరీ నుంచి 3.13 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసినట్లు విచారణలో తేలపడంతో పాటు ఇప్పటికే లాలూని దోషిగా నిర్ధారించిన కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఇందులో భాగంగా మార్చి 24 (శనివారం) ఏడేళ్ల శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఇప్పటికే పూర్తయిన మూడు కేసుల్లోనూ లాలూకి శిక్ష పడింది. 
 
ప్రస్తుతం లాలూ జైలు జీవితం అనుభవిస్తున్నారు. మొదటి కేసులో ఐదేళ్లు, రెండో కేసులో మూడున్నర ఏళ్లు, మూడో కేసులో ఐదేళ్ల శిక్ష పడింది. నాలుగో కేసులో మాత్రం ఏడేళ్ల శిక్ష పడింది. ఇకపోతే, లాలూతో పాటు దాణా కుంభకోణం కేసులో మరో 31 మంది నిందితులుగా ఉన్నారు. బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మాత్రం ఈ కేసులో నిర్ధోషిగా తేలారు. ఈ కేసులోనూ లాలూ దోషిగా తేలడంతో ఆయన ఇక ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments