Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో దాణా కుంభకోణంలో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (12:59 IST)
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోమారు దోషిగా తేలారు. మరో గడ్డి స్కామ్‌లో ఆయన దోషిగా నిలిచారు. ఈ మేరకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయన్ను దోషిగా తేల్చుతూ న్యాయమూర్తి సీకే షైని ఆదేశాలు జారీచేశారు. 
 
డొరండా ట్రెజరీ నుంచి రూ.139 కోట్ల అక్రమంగా తీసుకున్న కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆ సమయంలో ఆయన కోర్టు బోనులోనే ఉన్నారు. అయితే, శిక్షను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఒకవేళ ఈ కేసులో మూడేళ్లకు మించి శిక్ష పడితే మాత్రం ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సివుంటుంది. 
 
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువులకు ఉచిత దాణా పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద నిధులను ఇష్టానుసారంగా లాలూ ప్రభుత్వం విత్ డ్రా చేసి స్వాహా చేసింది. ఈ గడ్డి స్కాములో పలు కేసులు నమోదు కాగా, ఒక్కో కేసులో తీర్పును వెలువడుతూ వస్తుంది. తాజాగా ఐదో కేసులో తీర్పు వెలువడింది. కాగా, గత 2017 డిసెంబరు నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ జైలు జీవితం గడుపుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments