Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్షద్వీప్ ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు జైలుశిక్ష

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (11:06 IST)
లక్షద్వీప్ లోక్‌సభ స్థానం సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్‌ ఓ హత్యాయత్న కేసులో దోషిగా తేలారు. దీంతో ఆయనకు కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. ఇదే కేసులో మరో నలుగురిని కూడా దోషులుగా తేల్చింది. వీరందరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, గత 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీఎం సయీద్ అల్లుడైన పదాంత సాలిహ్‌ను హత్య చేయడానికి మరో నలుగురితో కలిసి ఫైజల్ ప్రయత్నించారన్నది ప్రధాన అభియోగం. దీనిపై విచారణ జరిపిన కోర్టు నిందితులంతా హత్యాయత్నానికి ప్రయత్నించి విఫలైనట్టు కోర్టు తేల్చింది. దీంతో వీరందరినీ దోషులుగా ప్రకటించింది. 
 
మరోవైపు, కోర్టు తీర్పు నేపథ్యంలో వీరిని కేరళ రాష్ట్రంలోని కున్నూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, హత్యాయత్న కేసులో మహ్మద్ దోషిగా తేలడంతో ఆయనపై లోక్‍సభలో అనర్హత వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టులో అప్పీల్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments