Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను అస్సలు లెక్కచేయలేదు.. కుంభమేళాలో లక్షలాది మంది..

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (10:00 IST)
Kumbh Mela
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో లక్షలాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొన్నారు. గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. భక్తి ప్రపత్తులతో గంగమ్మతల్లికి పూజలు నిర్వహించారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని 14వ తేదీన ప్రారంభమైన కుంభమేళా.. ఏప్రిల్ 27వ తేదీ వరకు కొనసాగుతుంది.
 
చైత్రమాసం పౌర్ణమితో ముగుస్తుంది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహా శివరాత్రి, సోమావతి అమావాస్య, బైసాఖీ, శ్రీరామ నవమి, చైత్ర పౌర్ణమి వంటి ప్రత్యేక రోజుల్లో భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు.
 
ఈ నాలుగు నెలల వ్యవధిలో కనీసం ఐదు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేసింది. అదెలా ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ ఉధృతంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో లక్షలాది మంది భక్తులు కుంభమేళాకు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. 
Kumbh Mela
 
కోవిడ్ మార్గదర్శకాలను పాటించడాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటికీ.. దాన్ని ఎవరూ పాటించట్లేదనేది సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోన్న వీడియోలను బట్టి చూస్తే తెలిసిపోతోంది. ఈ వీడియోలపై నెటిజన్ల నుంచి వివిధాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments