Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల గిరుల్లో క్రమంగా పెరుగుతున్న భక్తుల రద్దీ

తిరుమల గిరుల్లో క్రమంగా పెరుగుతున్న భక్తుల రద్దీ
, సోమవారం, 11 జనవరి 2021 (09:34 IST)
తిరుమల గిరుల్లో క్రమంగా భక్తలు రద్దీ పెరుగుతోంది. ఆదివారం 37,849 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.06 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. 15,338 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 
 
వారాంతం కావడంతోనే రద్దీ పెరిగిందని, భక్తులు కరోనా నిబంధనలను పాటిస్తూ, స్వామిని దర్శించుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ వారంలో సంక్రాంతి పర్వదినాలు రానున్నందున రద్దీ కొంతమేరకు తగ్గుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-01-2021 సోమవారం మీ రాశిఫలాలు - ఇంట్లో మార్పులు చేర్పులు..