Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాగ్‌‌రాజ్ అర్థకుంభమేళా ప్రారంభం.. తరలివచ్చిన అఘోరాలు

Webdunia
మంగళవారం, 15 జనవరి 2019 (12:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌ అర్థకుంభమేళా మంగళవారం అట్టహాసంగా ప్రారభమైంది. అపూర్వ ఆధ్యాత్మిక సంగమం.. వేల సంవత్సరాల విశ్వాసానికి తార్కాణం... ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ధార్మిక సమ్మేళనం... కోట్లాదిమంది ఒక్కచోట చేరే అద్భుత ఘట్టం.. పవిత్ర స్నానాలు ఆచరించే పుణ్య సమయం.. అదే కుంభమేళా. 
 
ఈ కుంభమేళాకు నాగ సాధువుల మంగళ స్నానాలతో 2019, జనవరి 15వ తేదీ మంగళవారం ప్రారంభమైంది. కుంభమేళా 8 వారాల పాటు(మార్చి 4వ తేదీ) సాగనుంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశంలోని నలు మూలల నుంచి సాధువులు భారీ ర్యాలీగా ప్రయాగ చేరుకున్నారు. 10 అఖాడాలకు చెందిన స్వాములు స్నానాలు ఆచరించారు. 
 
ముఖ్యంగా, కుంభమేళా... సనాతన భారతీయ జీవనశైలికి, మన సాంస్కృతిక వారసత్వానికి, సంప్రదాయాలకు అద్దం పడుతోంది. 8 వారాల పాటు జరిగే ఈ మేళాకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 2800 కోట్ల రూపాయల వ్యయంతో ఓ తాత్కాలిక ఆధ్యాత్మిక నగరాన్నే నిర్మించింది. ఆధ్యాత్మిక, రాజకీయ, పర్యాటక సంగమమైన ఈ మహా ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు.
 
49 రోజులపాటు జరిగే అర్థ కుంభమేళాకు యోగి అదిత్యానాథ్ ప్రభుత్వం 4 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. 192 దేశాల నుంచి 12 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. తొలి రోజు 30 లక్షల మంది స్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా. 2,800 కోట్లతో దాదాపు 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, గంగా నది ఒడ్డులను కలుపుతూ 22 వంతెనలు నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments