Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతాలో మరో కరోనా కేసు... వైరస్ వ్యాపించే దేశాల్లో భారత్ ఉందా?

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (18:06 IST)
భారత్‌లో మరో కరోనా వైరస్ కేసు వెలుగుచూసింది. కోల్‌కతాలో తాజాగా మరో కేసు బయటపడింది. దీంతో కోల్‌కతాలో మొత్తం కేసుల సంఖ్య మూడుకు చేరింది. నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మరో వ్యక్తికి నావల్ కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ చేశారు. ఈ మేరకు విమానాశ్రయా అధికారులు ఒక ప్రకటన చేస్తూ.. బ్యాంకాక్ నుంచి కోల్‌కతా చేరుకున్న ప్రయాణికుడికి పరీక్షలు చేయగా కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు.
 
ఈ కేసుతో కలుపుకుంటే కోల్‌కతాలో మొత్తం మూడు కేసులు నమోదైనట్టే. ఈ వారంలో హిమాద్రి బార్మాన్, నాగేంద్ర సింగ్ అనే ఇద్దరు ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలారని చెప్పారు. పాజిటివ్‌గా తేలిన వారిని బలియాఘటా ఐడి అస్పత్రికి పంపినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రభావంతో చైనాకు సర్వీసులు నడుపుతున్న పలు విమానాయన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి.
 
మరోవైపు, వైరస్ వ్యాపించే అవకాశమున్న మొదటి పది దేశాల్లో వరుసగా థాయ్‌లాండ్, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, తైవాన్, అమెరికా, వియత్నాం, మలేషియా, సింగూపూర్, కంబోడియాలున్నాయి. థాయ్‌లాండ్‌కు వైరస్ సోకే అవకాశాలు 2.1 శాతం ఉండగా, భారత్‌కు ఇది 0.2 శాతం ఉందని నివేదిక వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments