Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (12:27 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. బాధితురాలు చదువుతున్న సౌత్ కోల్‌కతా లా కాలేజీకి చెందిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుతో ఈ కేసులో పట్టుబడిన నిందితుల సంఖ్య నాలుగుకు చేరింది. 
 
వివరాల్లోకి వెళితే... సౌత్ కోల్‌ఖతా లా కాలేజీలో తొలి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై ఇటీవల కాలేజీ ప్రాంగణంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు అధికార టీఎంసీకి చెందిన స్థానిక నేతగా గుర్తించారు.
 
తాజాగా ఈ కేసులో సెక్యూరిటీ గార్డు పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు. విద్యార్థులకు రక్షణగా ఉండగాల్సిన గార్డే ఈ దారుణంలో పాలుపంచుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కళాశాల ఆవరణలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. అందులో రాజకీయ నాయకుడుతో పాటు కాలేజీ సిబ్బంది ప్రమేయం కూడా ఉండటంపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో నగరంలో మరోమారు మహిళల భద్రపై చర్చ మొదలైంది. కేసులో ఇంకెంతమంది పాత్ర ఉందనే కోరణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం