Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (10:58 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. అధిక వేడి, విపరీతమైన రద్దీ కారణంగా 600 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. 
 
ఈ ఘటనపై పూరీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కిషోర్ శతపతి మాట్లాడుతూ, యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పాటు ఎండ, ఉక్కపోత, రద్దీ కారణంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. చాలా మంది వాంతులు, కళ్లు తిరిగి పడిపోవడం, చిన్నపాటి గాయాలు వంటి లక్షణాలు కనిపించాయని ఆయన వివరించారు. వైద్య సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 
 
అస్వస్థతకుగురైన వారిలో చాలా మంది ప్రాథమిక చికిత్సలో కోలుకున్నారని, వారిని ఇళ్లకు పంపించేశామని డాక్టర్ కిషోర్ తెలిపారు. ప్రస్తుతం దాదాపు 700 మంది జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని, వారికి ప్రత్యేక వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయని వెల్లడించారు. భక్తుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

#chiranjeevi birthday : 'విశ్వంభరు'నికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments