Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిసంపదల కోసం ఇద్దరు మహిళల నరబలి.. ముక్కలు చేసిన భార్యాభర్తలు

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (09:27 IST)
కేరళ రాష్ట్రంలో దారుణం జరిగింది. నరబలి ఇస్తే సిరిసంపదలు వనగూరుతాయన్న ఆ దంపతులు బలంగా నమ్మారు. ఇందుకోసం ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారు. ఈ దారుణం కేరళ రాష్ట్రంలోని పథనంతిట్ట అనే జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని ముగ్గురు వ్యక్తులు ఆశపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి.. వారి మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. 
 
ఈ దారుణానికి తిరువళ్లకు చెందిన భగవంత్‌ సింగ్‌, అతని భార్య లైలా తెగబడ్డారు. వీరికి మహ్మద్‌ షఫీ అనే మరో వ్యక్తి తన వంతు సహకారం అందించాడు. ఇందులోభాగంగా, షఫీ అనే వ్యక్తి కడవంతర, కాలడీలకు చెందిన ఇద్దరు మహిళలతో మహ్మద్‌ షఫీ సోషల్‌ మీడియాలో స్నేహం చేశాడు. సెప్టెంబరు 26వ తేదీన వారికి మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేశాడు. అనంతరం భగవంత్‌ సింగ్‌ దంపతులతో కలిసి బలి ఇచ్చాడు. 
 
ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవనం సాగించే పద్మం (52), రోస్లీ(50)గా మృతులను గుర్తించారు. జీవితంలో ఆర్థిక కష్టాలు తొలగిపోవడంతోపాటు, సిరిసంపదలు కలుగుతాయన్న మూఢ నమ్మకంతోనే నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments