Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలాంటివారిని వాడుకోవడం లేదు .. అందుకే వీడుతున్నా.. సోనియాకు ఖుష్బూ లేఖ

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (13:04 IST)
తమిళ సినీ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పేశారు. ఆమె పార్టీని వీడుతూ, తన మనసులోని మాటలను లేఖ రూపంలో బహిర్గతం చేశారు. ముఖ్యంగా, పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. ఇందులో తాను పార్టీని ఎందుకు వీడుతున్నారో వివరించారు. తనలాంటి వారిని కొందరు నేతలు అణిచివేస్తున్నారనీ, వాస్తవ పరిస్థితికి పార్టీలోని పరిస్థితికి భిన్నంగా ఉందని వాపోయారు. 
 
ముఖ్యంగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆమె చెప్పారు. తాను ప్రజల కోసం పనిచేసేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. అంతేగానీ, పేరు, ప్రతిష్టల కోసం కాదని గుర్తుచేశారు. 
 
అయితే, కాంగ్రెస్ పార్టీలో కొన్ని శక్తులు తనను అణచివేశాయని, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో సహకరించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. 
 
కాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఖుష్బూ కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం ఆమె సోమవారం హస్తినకు చేరుకుని, బీజేపీ పెద్దలను కలుసుకున్న తర్వాత ఆమె కమలదళం సభ్యత్వం స్వీకరించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments