Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరణం తర్వాత చక్కని జీవితం పొందడమే లక్ష్యం.. సినిమాలకు గుడ్‌బై... ఎవరా హీరోయిన్?

మరణం తర్వాత చక్కని జీవితం పొందడమే లక్ష్యం.. సినిమాలకు గుడ్‌బై... ఎవరా హీరోయిన్?
, శుక్రవారం, 9 అక్టోబరు 2020 (17:43 IST)
ఆ హీరోయిన్‌లో చాలా మార్పు వచ్చింది. నిన్నామొన్నటి వరకు తన అంద చందాలతో సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆ భామ ఇపుడు కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పింది. అదేసమయంలో తాను మరణించిన తర్వాత చక్కని జీవితం పొందడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. ఇందుకోసం తాను చేయాల్సింది చాలా ఉందని తెలిపింది. ఇంతకీ అంతటి కఠిన నిర్ణయం తీసుకున్న హీరోయిన్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు.. సనాఖాన్. బాలీవుడ్ నటి. ఈమె బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కూడా. ఇకపై తాను సినిమాలు చేయనని ప్రకటించింది. సినీ పరిశ్రమ నుంచి వైదొలుగుతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. దీనికి సంబంధించి ఓ పెద్ద లేఖలో ఇన్‌స్టాలో పోస్టు చేసింది. 
 
ఇక నుంచి తాను సమాజ సేవలో తరిస్తానని.. సృష్టకర్త ఆదేశాలను అనుసరిస్తానని తెలిపింది. తన ఫాలోవర్లను ఉద్దేశిస్తూ హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పెద్ద నోట్‌ను రాసింది. గత కొన్ని రోజులుగా తన జీవితంపై తీవ్ర ఆలోచనల్లో ఉన్నట్టు ఆ లేఖలో ఆమె తెలిపింది. ఇది తన జీవితపు కీలకమైన దశ అని ఆమె చెప్పింది. తన జీవితపు అసలైన పరమార్థాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిపింది. 
 
డబ్బు, పేరు కోసమేనా ఈ జీవితమని తనలో తాను ప్రశ్నించుకున్నట్టు లేఖలో రాసింది. అవసరార్థుల కోసం.. నిస్సహాయుల కోసమే తన శేషజీవితమని తెలిపింది. చావును ఎదుర్కోక తప్పదా, చనిపోయాక ఏం జరుగుతుందనే ఈ రెండు ప్రశ్నలు గత కొన్ని రోజులుగా తనను వేధిస్తున్నాయని తెలిపింది.
 
ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కొనే పనిలో పడ్డాను. ఈ ప్రపంచంలోకి రావడం వెనక అసలు కారణం... మరణం తర్వాత చక్కని జీవితాన్ని పొందడమే. ఈ ఆలోచనల అనంతరం ఈ సినీ జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నా. సమాజ సేవలో ముందుకు సాగాలనకుంటున్నా అన సనాఖాన్ రాసుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరోటా సూరికి సీఐడీ సమన్లు.. విష్ణు విశాల్‌ తండ్రిపై ఫిర్యాదు చేయడంతో?