Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు రికమెండేషన్ - ఖుష్భూకు ఆ పార్టీలో ఆ పదవి...

తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథ్యం రాబోతోంది. చాలా రోజుల తరువాత ఒక మహిళకు ఆ పగ్గాలను కాంగ్రెస్ పార్టీ అప్పజెబుతోంది. ఆమె ఎవరో కాదు సినీ నటి ఖుష్భూ. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన ఖుష్భూకే ఆ పదవి అప్పగించాలన్న నిర్ణయానికే అధిష్టానం వచ్చేసింది. ప

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (18:05 IST)
తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథ్యం రాబోతోంది. చాలా రోజుల తరువాత ఒక మహిళకు ఆ పగ్గాలను కాంగ్రెస్ పార్టీ అప్పజెబుతోంది. ఆమె ఎవరో కాదు సినీ నటి ఖుష్భూ. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన ఖుష్భూకే ఆ పదవి అప్పగించాలన్న నిర్ణయానికే అధిష్టానం వచ్చేసింది. పండుగ రోజే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో తమిళనాడులో ప్రజల్లో చరిష్మా ఉన్న నేత ఉంటే బాగుంటుందన్నది కాంగ్రెస్ అధినేతల ఆలోచన. అందుకే ఖుష్భూను ఎంచుకున్నారు.
 
అందులోను మెగాస్టార్ చిరంజీవి ఖుష్భూకు రెకమెండేషన్ చేయడంతో అధిష్టానం కాదనలేకపోయింది. చిరు, ఖుష్భూలిద్దరు గతంలో ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఇద్దరికి మంచి పరిచయం ఉంది. రాజకీయాల్లో మాత్రం ఇద్దరు మొదట్లో వేర్వేరుగా ఉన్నా ఆ తరువాత సినిమా ఫంక్షన్లలో మాత్రం పరిచయం కొనసాగుతూ వచ్చింది. అది కాస్త ఇప్పుడు ఖుష్భూ రాజకీయంగా నిలబడేందుకు దోహదం చేస్తోంది. తమిళనాడులో ఇప్పటికే సినీనటులు రాజకీయ రంగప్రవేశం చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో ఖుష్బూను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments