Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ పాఠశాలలన్నీ డిజిటలైజయిన తొలి రాష్ట్రం కేరళ

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (08:12 IST)
దేశంలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ హైటెక్‌ తరగతి గదులు కలిగిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ నిలవనుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. విద్యారంగం పూర్తిగా డిజిటలైజ్‌ చేయబడిందని ప్రకటించారు. ఇది రాష్ట్రం సాధించిన అద్భుతమైన విజయమని, తరువాతి తరాలకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.

విద్యారంగాన్ని పూర్తి డిజిటలైజ్‌గా మార్చిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలవనుందని ప్రకటిస్తూ.. విజయన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఈ మిషన్‌కు నాయకత్వం వహించిందని, ప్రభుత్వ విద్యను డిజిటలైజ్‌ చేసేందుకు నాలుగు సంస్థలను నియమించినట్లు చెప్పారు.

అన్ని సంస్థలు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో పనిచేశాయని అన్నారు. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందిస్తామని, అయితే పాఠశాలలను పున:ప్రారంభించేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు.

ఎంపి, ఎమ్మెల్యే నిధులు, స్థానిక స్వపరిపాలన సంస్థల నిధులను ఈ తరగతి గదుల ఏర్పాటుకు ఉపయోగించామని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో 5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ప్రజల వైఖరితో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా మారిపోయిందని అన్నారు.

విద్య, ఇతర రంగాలలో పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గ్రామంలోని ఏ పాఠశాల అయినా ప్రపంచంలోని పాఠశాలలకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు.

స్మార్ట్‌ తరగతి గదుల ప్రాజెక్టులో భాగంగా 16,027 పాఠశాలలకు సుమారు 3.74లక్షల డిజిటల్‌ పరికరాలను అందించామని అన్నారు. మొదటి దశలో 4,752 ప్రభుత్వ, ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలల్లో 8 నుండి 12 వ తరగతులకు 45వేల హైటెక్‌ తరగతి గదులు సిద్ధం చేశామని చెప్పారు.

ఈ ప్రాజెక్ట్‌ను 2018, జనవరి 21న ప్రారంభించామని ప్రకటించారు. అలాగే 1నుండి 7వ తరగతులకు 11,275 ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో హైటెక్‌ ల్యాబ్‌లు ప్రారంభించామని, ఈ కార్యక్రమం గతేడాది ప్రారంభించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments