Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరబలి కేసులో కొత్త ట్విస్ట్ : శరీరాన్ని 56 ముక్కలు చేసి వండి ఆరగించారు...

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (17:04 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. సిరిసంపదలతో జీవించవచ్చన్న దురాశతో ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారు. ఈ బలి తర్వాత మృతదేహాలను ఏకంగా 56 ముక్కలు చేశారు. ఇందులో కొన్ని భాగాలను వంట చేసుకుని ఆరగించినట్టు విచారణ జరుపుతున్న పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
కేరళ రాష్ట్రంలోని తిరువళ్లకు చెందిన భగవంత్ సింగ్ - లైలా అనే దంపతులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వీరు వాటి నుంచి బయటపడడంతోపాటు సిరిసంపదలు కలుగుతాయన్న ఉద్దేశంతో నరబలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరికి మహ్మద్ షఫీ అనే వ్యక్తి తోడయ్యాడు. అందరూ కలిసి నరబలికి సిద్ధమయ్యారు. 
 
ఈ క్రమంలో కడవంతర, కాలడీలకు చెందిన ఇద్దరు మహిళలతో షఫీ సామాజిక మాధ్యమాల్లో స్నేహం చేశాడు. పథకంలో భాగంగా గత నెల 26న ఆ ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశాడు. అనంతరం భగవంత్ సింగ్ దంపతులతో కలిసి వారిని బలిచ్చాడు. మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. 
 
బాధిత మహిళలను లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవించే పద్మం (52), రోస్లీ (50)గా పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో వారు చెప్పిన విషయాలు విని విస్తుపోయారు. ఆర్థికంగా లాభపడేందుకే నరబలి ఇచ్చినట్టు  చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.
 
అయితే, ఈ ఇద్దరు మహిళలను బలిచ్చే ముందు రోజెలిన్, పద్మలను కట్టేసి చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా వారి స్థనాలనుకోసేసి రక్తం ప్రవహింప చేశారని పోలీసులు తెలిపారు. పద్మను షఫీయే గొంతు నులిమి చంపేసి.. ఆ తర్వాత తల తెగనరికేశాడు. ఆ దేహాన్ని 56 ముక్కలు చేశాడని, రోజెలిన్‌ను లైలా కొంతు నులిమి చంపేసిందని పోలీసుల విచారణలో వెల్లడించారు. ఆ మాంసాన్ని షపీ భుజించి వుంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments