Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ ఫూల్స్ డే: కేరళలో ఆ యువకుడు ఉరేసుకోబోయాడు.. చివరికి..?

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (16:36 IST)
ఏప్రిల్ ఫూల్స్ డే గురించి తెలిసిందే. ఏప్రిల్ ఫూల్స్ డే రోజున స్నేహితులను ఫూల్ చేయబోయిన ఓ యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు స్నేహితులను ఫూల్‌ చేయబోయిన ఓ యువకుడు ఉరికి చిక్కుకుని మరణించాడు. కేరళలోని అలప్పుజ జిల్లాలో ఏప్రిల్‌ 1న ఈ ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. తలావాడికి సమీపంలోని కిలిరూర్‌లో 17 ఏండ్ల సిద్దార్థ్ అజయ్ తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి భోజనం తర్వాత తన గదిలోకి వెళ్లాడు. చాలా సేపటి వరకు అతడు గది నుంచి రాకపోవడంతో తల్లి వెళ్లి చూడగా సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
 
మరోవైపు ఆ గదిలోని కిటికీ వద్ద అతడి మొబైల్ ఫోన్‌ లైవ్‌ స్ట్రీమ్‌లో ఉన్నది. దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్నేహితులను ఫూల్‌ చేయబోయిన సిద్దార్థ్‌ మెడకు బెడ్‌షీట్‌ చిక్కుకోవడంతో మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments