Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రమాదం : కోళికోడ్ విమానాశ్రయం తాత్కాలిక మూసివేత

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (09:19 IST)
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్‌ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమాన పైలట్లతో సహా మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. పైగా, ఇక్కడికి వచ్చే విమానాలన్నింటినీ కోచి అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. 
 
వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయి నుంచి కోళికోడ్‌కు వచ్చిన ఏయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ గత శుక్రవారం రాత్రి టేబుల్‌ టాప్‌ రన్‌వేపై ల్యాండ్‌ అవుతుండగా అదుపు తప్పి 35 అడుగుల లోతు కలిగిన లోయలో పడింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. 
 
ఈ ప్రమాదంలో పైలట్‌ ఇన్‌ కమాండ్‌ కెప్టెన్‌ దీపక్‌ సాతే, ఆయన కో పైలట్‌ అఖిలేష్‌ కుమార్‌తో పాటు మొత్తం 20 మంది వరకు మరణించారు. ప్రమాద సమయంలో విమానంలో 10 మంది పిల్లలు, ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్‌ సిబ్బంది సహా 190 మంది ఉన్నారని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. 
 
భారీ వర్షం కారణంగా విమానం ల్యాండ్‌ అవుతున్న క్రమంలో విమానం అదుపు తప్పి లోయలో పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ వర్షాకాలం సీజన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నందున ముగిసే వరకు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments