Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో షవర్మా ఆర్డర్ చేసి తిన్నాడు.. అంతే తిరిగి రాని లోకాలకు..?

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (12:23 IST)
ఆన్‌లైన్‌లో షవర్మా ఆర్డర్ చేసి తిన్న యువకుడి పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై అతనికి చికిత్స అందించారు. చివరికి చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. మృతి చెందిన యువకుడి పేరు నాయర్. 24 ఏళ్ల రాహుల్ కొట్టాయం నివాసి. గత బుధవారం కాక్కనాడ్‌లోని ఓ హోటల్‌ నుంచి రాహుల్‌ షవర్మాను ఆర్డర్ చేశాడు. అది తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 
 
యువకుడి ఫిర్యాదుతో హోటల్‌ను మూసివేశారు. ఈ విషయమై ఆరోగ్యశాఖ మంత్రి డీహెచ్‌ఎస్‌ను వివరణ కోరారు. వీలైనంత త్వరగా నివేదిక అందజేయాలని ఆదేశించారు.   
 
మూడు రోజుల క్రితం రాహుల్ పరిస్థితి విషమించింది. దాంతో అతడిని ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యాడు. అతడి కిడ్నీ పాడైంది. అతని పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. అతని డయాలసిస్ ప్రారంభమైంది. షవర్మా తిన్నాక ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయని డాక్టర్‌తో రాహుల్ చెప్పాడు.
 
రాష్ట్రంలో నిషేధం విధించిన మయోనైజ్‌ను శర్వామాలో వాడారా అనే దానిపై ఆరోగ్య శాఖ విచారణ చేస్తుండగా రాహుల్ మృతి చెందాడు. ఈ కేసులో రసాయన పరీక్షల నివేదిక ఇంకా బయటకు రాలేదు. రాహుల్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ కొట్టాయం నివాసి. ఆరోపణల నేపథ్యంలో కక్కనాడ్‌లోని లే హయత్ హోటల్‌ను మూసివేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments