Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఆంధ్రా వాసుల మృత్యువాత

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (12:00 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ఆంధ్రావాసులు మృత్యువాతపడ్డారు. ఈ రాష్ట్రంలోని చిక్‌బళ్ళాపూర్ సమీపంలో రోడ్డుపై ఆగివున్న ట్యాంకర్ లారీని టాటా సుమో అమిత వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వలస కూలీలు మృత్యువాతపడ్డారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ వరస కూలీలంతా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా గుర్తించారు. 
 
దసరా పండుగకు కూలీలంతా సొంతూళ్లకు వచ్చారు. పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్న వారంతా తిరిగి కూలీ పనులకు బెంగుళూరులోని హోంగసంద్రకు వెళుతుండగా తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున పొగమంచు దట్టంగా ఉండటంతో ముందు ఆగివున్న వాహనాలు కనిపించలేదు. దీంతో డ్రైవర్ నరసింహులు రోడ్డుపై ఆగివున్న ట్యాంకర్ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సుమోలో ఉన్న 14 మందిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు చిక్‌బళ్లాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments