Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఆంధ్రా వాసుల మృత్యువాత

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (12:00 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ఆంధ్రావాసులు మృత్యువాతపడ్డారు. ఈ రాష్ట్రంలోని చిక్‌బళ్ళాపూర్ సమీపంలో రోడ్డుపై ఆగివున్న ట్యాంకర్ లారీని టాటా సుమో అమిత వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వలస కూలీలు మృత్యువాతపడ్డారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ వరస కూలీలంతా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా గుర్తించారు. 
 
దసరా పండుగకు కూలీలంతా సొంతూళ్లకు వచ్చారు. పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్న వారంతా తిరిగి కూలీ పనులకు బెంగుళూరులోని హోంగసంద్రకు వెళుతుండగా తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున పొగమంచు దట్టంగా ఉండటంతో ముందు ఆగివున్న వాహనాలు కనిపించలేదు. దీంతో డ్రైవర్ నరసింహులు రోడ్డుపై ఆగివున్న ట్యాంకర్ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సుమోలో ఉన్న 14 మందిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు చిక్‌బళ్లాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments