Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఆంధ్రా వాసుల మృత్యువాత

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (12:00 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ఆంధ్రావాసులు మృత్యువాతపడ్డారు. ఈ రాష్ట్రంలోని చిక్‌బళ్ళాపూర్ సమీపంలో రోడ్డుపై ఆగివున్న ట్యాంకర్ లారీని టాటా సుమో అమిత వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వలస కూలీలు మృత్యువాతపడ్డారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ వరస కూలీలంతా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా గుర్తించారు. 
 
దసరా పండుగకు కూలీలంతా సొంతూళ్లకు వచ్చారు. పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్న వారంతా తిరిగి కూలీ పనులకు బెంగుళూరులోని హోంగసంద్రకు వెళుతుండగా తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున పొగమంచు దట్టంగా ఉండటంతో ముందు ఆగివున్న వాహనాలు కనిపించలేదు. దీంతో డ్రైవర్ నరసింహులు రోడ్డుపై ఆగివున్న ట్యాంకర్ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సుమోలో ఉన్న 14 మందిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు చిక్‌బళ్లాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments