Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరు పెట్టడానికి కుదరని ఏకభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (12:58 IST)
కేరళ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. తమ బిడ్డకు పేరు పెట్టేందుకు తల్లిదండ్రుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దీంతో కేరళ రాష్ట్ర హైకోర్టే ఆ చిన్నారికి పేరు పెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దంపతుల మధ్య విభేదాలు పొడచూపడంతో భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. ఆ పాపకు పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ వివాదం చివరకు కేరళ హైకోర్టుకు చేరింది. 
 
కేరళకు చెందిన ఓ జంటకు గత 2020 ఫిబ్రవరిలో ఓ పాప పుట్టింది. ఆ తర్వాత దంపతులు విడిగా ఉంటున్నారు. పాప తల్లి వద్దే ఉంటోంది. గతంలో చిన్నారికి జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంలో పేరు లేకపోవడంతో.. ఓ పేరు నమోదు చేసేందుకు తల్లి ప్రయత్నించారు. పేరు నమోదుకు తల్లిదండ్రులిద్దరూ హాజరు కావాలని సంబంధిత అధికారి స్పష్టం చేశారు. 
 
దీంతో ఆ చిన్నారికి దంపతులిద్దరూ వేర్వేరు పేర్లు సూచించారు. ఇద్దరూ పట్టు వీడకపోవడంతో.. పాప తల్లి కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్‌ బెచు కురియన్‌ థామస్‌ కోర్టు అధికార పరిధిని వినియోగించుకొని ఈ సమస్యను పరిష్కరించారు. తల్లి సూచించిన పేరుతోపాటు తండ్రి పేరునూ జత చేసి, పాపకు ఓ పేరు ఖరారు చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments