Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ అయినా వదలరా? నర్సుపై హెల్త్‌ ఇన్‌స్పెక్టర్ అత్యాచారం..

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:33 IST)
దేశంలో కరోనా వైరస్‌తో ప్రజలు నానా తంటాలు పడుతున్న వేళ.. కామాంధులు మాత్రం మారట్లేదు. కేరళలోని తిరువనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. హోం క్వారంటైన్‌ పేరుతో తనపై ఆరోగ్య అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించడంతో కేరళలో సంచలనం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళ మలప్పురంలో 44 ఏళ్ల మహిళ హోం నర్సుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె విధులు ముగించుకుని తన ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ఆ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్ ఆమెను క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు.
 
ఈ నేపథ్యంలో ఆమె యాంటీజెన్‌ పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌గానే తేలింది. ఆ పరీక్షల ధ్రువీకరణపత్రాల్ని తన ఇంటికి వచ్చి తీసుకోవాల్సిందిగా ఆ వ్యక్తి ఆమెకు సూచించాడు. దీంతో సెప్టెంబర్‌ 3న ఆమె అతడి ఇంటికి వెళ్లగా సదరు వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడి, తర్వాతి రోజు వదిలిపెట్టినట్లు మహిళ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments