Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్, ఢిల్లీలో విజృంభిస్తోన్న కరోనా.. 3800 పోలీసులకు కోవిడ్

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:20 IST)
కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తాజాగా పంజాబ్‌లో 3800 మందికి పైగా పోలీసులకు కొవిడ్‌ సోకినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 3803 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వీరిలో 2,186 మంది కోలుకోగా, ఇంకా 1,597 మంది పోలీసులు చికిత్స పొందుతున్నారు.
 
కోవిడ్‌తో బాధపడుతున్న పోలీసులకు రూ.1700 విలువ గల (పల్స్‌ ఆక్సీమీటర్‌, శానిటైజర్లు, డిజిటల్‌ థర్మామీటర్‌, విటమిన్‌ మాత్రలు) కిట్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న 20 మందికిపైగా పోలీసులు ప్లాస్మా దానం చేశారు.
 
అలాగే ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 2077 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,93,526కి చేరింది. ఇందులో 1,68,384 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 20,543 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments