Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయల్ బెంగాల్ టైగర్‌కు కోరల పదును రూచిచూపించిన అడవిపంది...

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:03 IST)
సాధారణంగా పెద్దపులి దెబ్బకు ఏ జంతువైనా బలికావాల్సిందే. పులి వస్తున్నట్టు జాడ తెలియగానే ప్రతి పశుపక్షాలు కాలికి పనిచెబుతాయి. కానీ, కజిరంగా అభరాణ్యంలో ఓ అరుదైన ఘటన ఒకటి జరిగింది. రాయల్ బెంగాల్ టైగర్ ఓ అడవి పంది చేతిలో చనిపోయింది. అదేవిధంగా అడవి పంది కూడా మృత్యువాతపడింది. ఈ ఘటన ఎపుడో జరగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు కళేబరాలను అధికారులు గుర్తించి ఆశ్చర్యపోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్ద పులులు అధికంగా ఉండే కజిరంగా అభయారణ్యంలోని కోహోరా ఫారెస్ట్ రేంజి పరిధిలో రెండు జంతువుల కళేబరాలను అధికారులు గుర్తించారు. వాటిలో ఒకటి రాయల్ బెంగాల్ టైగర్ కాగా, మరొకటి అడవిపంది. 
 
దీనిపై అధికారులు వ్యాఖ్యానిస్తూ, ఓ పోరాటంలో పులి, అడవిపంది రెండూ చనిపోవడంతో ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. పెద్దపులి ఉదర భాగంలో తీవ్రగాయాలు కనిపించాయని, అడవిపంది ఒంటినిండా గాయాలేనని కజిరంగా పార్క్ రీసెర్చ్ ఆఫీసర్ రాబిన్ సర్మా తెలిపారు. 
 
తీవ్ర గాయాల కారణంగా ఈ రెండు జంతువులు తాము పోరాడిన స్థలం నుంచి కదల్లేకపోయి ఉంటాయని వివరించారు. కాగా, ఈ రెండు వన్యమృగాలకు పోస్టుమార్టం జరిపిన స్థానిక పశువైద్యులు, నమూనాలను గౌహతి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments