Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయల్ బెంగాల్ టైగర్‌కు కోరల పదును రూచిచూపించిన అడవిపంది...

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:03 IST)
సాధారణంగా పెద్దపులి దెబ్బకు ఏ జంతువైనా బలికావాల్సిందే. పులి వస్తున్నట్టు జాడ తెలియగానే ప్రతి పశుపక్షాలు కాలికి పనిచెబుతాయి. కానీ, కజిరంగా అభరాణ్యంలో ఓ అరుదైన ఘటన ఒకటి జరిగింది. రాయల్ బెంగాల్ టైగర్ ఓ అడవి పంది చేతిలో చనిపోయింది. అదేవిధంగా అడవి పంది కూడా మృత్యువాతపడింది. ఈ ఘటన ఎపుడో జరగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు కళేబరాలను అధికారులు గుర్తించి ఆశ్చర్యపోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్ద పులులు అధికంగా ఉండే కజిరంగా అభయారణ్యంలోని కోహోరా ఫారెస్ట్ రేంజి పరిధిలో రెండు జంతువుల కళేబరాలను అధికారులు గుర్తించారు. వాటిలో ఒకటి రాయల్ బెంగాల్ టైగర్ కాగా, మరొకటి అడవిపంది. 
 
దీనిపై అధికారులు వ్యాఖ్యానిస్తూ, ఓ పోరాటంలో పులి, అడవిపంది రెండూ చనిపోవడంతో ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. పెద్దపులి ఉదర భాగంలో తీవ్రగాయాలు కనిపించాయని, అడవిపంది ఒంటినిండా గాయాలేనని కజిరంగా పార్క్ రీసెర్చ్ ఆఫీసర్ రాబిన్ సర్మా తెలిపారు. 
 
తీవ్ర గాయాల కారణంగా ఈ రెండు జంతువులు తాము పోరాడిన స్థలం నుంచి కదల్లేకపోయి ఉంటాయని వివరించారు. కాగా, ఈ రెండు వన్యమృగాలకు పోస్టుమార్టం జరిపిన స్థానిక పశువైద్యులు, నమూనాలను గౌహతి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments