Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్ పాలిసెట్ -2020 ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (19:59 IST)
కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. కాని కొద్ది రోజుల క్రితం లాక్ డౌన్ సడలింపుతో అటు ప్రభుత్వం ఇటు విద్యాశాఖ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వాయిదా పడుతూ వచ్చిన టీఎస్ పాలిసెట్-2020 ప్రవేశాల షెడ్యూల్ ఎట్టకేలకు ఖరారు చేసింది.
 
షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే పాలిసెట్ మొదటి విడత ప్రవేశాలకు సెప్టెంబరు 12వ తేదీ నుంచి జరగనుంది. అనంతరం ధ్రువపత్రాల పరిశీలనకు 12వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనను నిర్వహించనున్నారు. అనంతరం వెబ్ ఆప్షన్‌ను విద్యార్థులు 14 నుంచి 20 వరకు ఇచ్చుకోవాలి. 
 
22నుంచి సీట్ల కేటాయింపు జరగనుంది. ఇక పాలిసెట్ తుది విడత ప్రవేశాలు ఈ నెల 30 నుంచి నిర్వహంచనున్నారు. వెబ్ ఆప్షన్లు 30వ తేదీన, అక్టోబరు 1న ఇచ్చుకోవాలి. తుది విడత ప్రవేశాలకు సీట్లు కేటాయింపు అక్టోబరు 3న చేస్తారు. ఇక ప్రక్రియ పూర్తయిన అనంతరం పాల్ టెక్నిక్ విద్యాసంవత్సరం అక్టోబరు 7 నుంచి ప్రారంభం కానుంది. అదేవిధంగా అక్టోబరు15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 8న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments