Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జిల్లాలో అలజడి సృష్టించిన పులిని చంపేయాలంటూ సర్కారు ఆదేశం

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (14:02 IST)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ఓ పులి అలజడి సృష్టించింది. శనివారం ఓ రైతుపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేరళ ప్రభుత్వం ఆ పులిని చంపేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. మృతి చెందిన రైతును వయనాడ్‌కు చెందిన ప్రకాశ్‌గా గుర్తించగా వయసు 36 సంవత్సరాలు. శనివారం పొలంలోకి పచ్చిగడ్డి కోసం వెళ్లగా, పులి దాడి చేసింది. 
 
ఈ దాడిలో ప్రకాశ్ మృతి చెందిడంతో అతని శరీరంలో సగ భాగాన్ని ఆరగించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని తరలించవద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనపై స్పందించిన స్థానికులు... ఆ పులిని చంపేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. 
 
అయితే, ఆ పులి మ్యాన్ ఈటర్ అవునా కాదా అనే విషయాన్ని ధృవీకరించుకోవాలని సూచించింది. ఆ పులి మ్యాన్ ఈటర్ అని తేలిన తర్వాత దానిని అదుపులోకి తీసుకోలేకపోతే, దానిని చంపేయాలి" అని పేర్కొంది. ప్రస్తుతం దాని జాడ గుర్తించేందుకు పలు ప్రాంతాల్లో అటవీ శాఖ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ జనవరిలో కూడా వయనాడ్‌లో ఈ తరహా ఘటనే జరిగింది. అపుడు కూడా పులి దాడి చేసిన ఘటనలో 52 యేళ్ల రైతు ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments