Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిబాబా పాదాల వద్ద గుండెపోటుతో భక్తుడి మృతి... ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (16:44 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ పట్టణంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూనే ఓ భక్తుడు దైవం చెంతకు చేరుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, రాజేశ్ మేహానీ అనే భక్తుడు స్థానిక సాయిబాబా ఆలయంలో పూజలో పాల్గొన్న అనంతరం బాబా విగ్రహం పాదాల వద్ద కూర్చొని దైవాన్ని ప్రార్థిస్తూనే ప్రాణాలు విడిచాడు. 
 
బాబా పాదాల వద్ద తలవాల్చి కూర్చొన్న రాజేశ్.. ఎంత సేపటికి పైకి లేవకపోవడంతో తోటి భక్తులు పూజారికి సమాచారం అందించారు. ఆయన వచ్చి రాజేశ్‌ను కదపగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించగా, రాజేశ్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆలయ ప్రార్థన సమయంలోనే రాజేశ్‌కు నిశ్శబ్ద గుండెపోటు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
స్థానికంగా మెడికల్ షాపును నడుపుతున్న రాజేశ్.. ప్రతి గురువారం స్థానికంగా ఉండే సాయిబాబా గుడికి క్రమం తప్పకుండా వచ్చి తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆయన మృతి చెందారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇపుడు సోషల్ మీడియాలో వైరలైంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments