Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిలాస్‌పూర్ - నాగ్‌పూర్‌ల మధ్య వందే భారత్ సేవలు..

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (15:54 IST)
దేశంలో మరో వందే భారత్ రైలు (సెమీ హైస్పీడ్ రైలు) ఈ నెల 11వ తేదీ నుంచి పట్టాలెక్కనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ల మధ్య ఈ రైలును నడుపనున్నారు. 
 
వారంలో ఆరు రోజుల పాటు తిరిగేలా ఈ సెమీ హైస్పీడ్ వందే భారత్ రైలు సర్వీసును పట్టాలెక్కించనున్నట్టు భారతీయ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య గమ్యాన్ని ఈ రైలు కేవలం ఐదున్నర గంటల లోపే చేరుకుంటుంది. పైగా, ఇది రాయపూర్, దుర్గ్, గోండియా రైల్వే స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుందని తెలిపారు. 
 
ఇదిలావుంటే, సికింద్రాబాద్ - విజయవాడల మధ్య కూడా మరో వందే భారత్ రైలును నడుపనున్నారు. ఇది వచ్చే యేడాది నుంచి పట్టాలెక్కనుంది. ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ సమాచార వ్యవస్థ, వైఫై, సౌకర్యవంతమైన సీట్లతో వచ్చేయేడాది ఆగస్టులోగా 75వ వందే భారత్ రైళ్లను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు రైల్వే శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments