Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంకు బాగోతం... భర్తకు కాఫీలో విషం కలిపిచ్చిన భార్య

Webdunia
బుధవారం, 21 జులై 2021 (11:47 IST)
తన రంకు బాగోతానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసేందుకు తన ప్రియుడితో కలిసి ఓ భార్య పక్కా ప్లాన్ వేసింది. కాఫీలో విషం కలిపి భర్తకు ఇచ్చి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మైసూరు సమీపంలోని టి.నరసిపుర తాలూకాలోని హుణసగళ్ళిలో వెంకటరాజు, ఉమ అనే దంపతులు ఉన్నారు. అయితే, ఉమకు అదే ప్రాంతానికి చెందిన అవినాశ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది భర్తకు తెలిసి భార్యను హెచ్చరించాడు. పైగా, అవినాశ్‌తో శారీరకసుఖం తీర్చుకునేందుకు భర్త అడ్డుగా మారాడు. 
 
దీంతో ఆయన్ను మట్టుబెట్టాలని ఉమ నిర్ణయించుకుని, తన ప్రియుడు అవినాశ్‌తో చేతులు కలిపింది. ఈ క్రమంలో కాఫీలో విషం కలిపి భర్తకు ఇచ్చింది. ఈ కాఫీని సేవించిన వెంకటరాజు స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత తలదిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. 
 
ఆ తర్వాత సాధారణ మరణంగా చిత్రీకరించింది. అయితే, వెంకటరాజు కుటుంబ సభ్యులు సందేహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉమ - అవినాశ్‌లో అక్రమం సంబంధం బహిర్గతం కావడంతో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అసలు విషయం వెల్లడైంది. దీంతో ఉమ, అవినాశ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments