Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడు చోరీ చేశాడనీ అవమానభారంతో ఇద్దరు పిల్లలతో బావిలో దూకిన అక్క!!

ఠాగూర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (08:55 IST)
కర్నాటక రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన భర్త మొబైల్ ఫోనును తమ్ముడు చోరీ చేశాడు. దీనిపై భార్యను భర్త నిలదీశాడు. బావ ఫోనును తమ్ముడు చోరీ చేయడాన్ని జీర్ణించుకోలేని అక్క తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్రంలోని చామరాజ నగర జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చామరాజ నగర జిల్లాలోని హనూరు తాలూకా కాడుగోళ గ్రామానికి చెందిన సుశీల (30)ను చూసేందుకు తమ్ముడు మాదేవ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళుతూ బావ మహేశ్ ఫోనుతో పాటు నగదును తీసుకుని వెళ్లాడు. దీన్ని గుర్తించిన మహేశ్... బావమరిదిని దుర్భాషలాడాడు. ఇంటికొచ్చి ఇలాంటి పనులేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది వారిద్దరి మధ్య వాగ్వివాదానికి కారణమైంది. 
 
ఆ తర్వాత తన భార్య సుశీలతోనూ భర్త మహేశ్ గొడవడ్డాడు. దీంతో ఆమె తమ్ముడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తమ్ముడు చేసిన పనికి అవమానభారంతో రగిలిపోయింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోయింది. అయితే, తనపై అలిగి పుట్టింటికి వెళ్లివుంటుందని భర్త భావించాడు. 
 
అయితే, సోమవారం గ్రామంలోని ఓ బావివద్ద సుశీల చెప్పులు, తాళిబొట్టు, ఇతర వస్తువులను గ్రామస్థులు గుర్తించడంతో  ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో గాలించారు. సుశీల, పిల్లలు దివ్య (11), చంద్రు (8) మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments