Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూగ కుమారుడిని మొసళ్ళ నదిలో విసిరేసిన తల్లి.. ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 6 మే 2024 (12:49 IST)
కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఓ అమానీవయ ఘటన జరిగింది. పుట్టు మూగ కొడుకు విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై ఇటీవల మరోమారు ఆ దంపతుల మధ్య తరచూ ఘర్షణ జరిగింది. దీంతో ఆ భార్య మనసు పాషాణంగా మారిపోయింది. దీంతో కన్నబిడ్డను మొసళ్ళ నదిలో విసిరేశాడు. ఈ అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి కుమార్, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు పుట్టు మూగ. దాంతో ఆ పిల్లాడి విషయమై సావిత్రితో భర్త తరచూ గొడవ పడేవాడు. ఎందుకు అలా మూగవాడికి జన్మనిచ్చావంటూ, ఆ పిల్లావాడిని ఎక్కడైనా వదిలేసి రావాలని భార్యతో రవి కుమార్ మూర్ఖంగా ఘర్షణపడేవాడు. ఈ విషయమై శనివారం సాయంత్రం మరోసారి వారి మధ్య గొడవ జరిగింది. భర్త గొడవలతో విసిగెత్తిపోయిన సావిత్రి మూగ కొడుకును తీసుకెళ్లి మొసళ్లు ఉండే కాళి నదిలో విసిరేసింది. సావిత్రి తన కుమారుడిని నదిలో విసిరేయడం చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో బాలుడి కోసం వెతికించారు.
 
కానీ, అప్పటికే చీకటి పడడంతో బాలుడు దొరకలేదు. ఆదివారం ఉదయం బాలుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. పిల్లాడి శరీరంపై గాయాలు ఉండడంతో పాటు ఒక చేయి కూడా లేకపోవడంతో మొసళ్లు దాడి చేసి ఉంటాయని పోలీసులు వెల్లడించారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్న దండేలి రూరల్ పోలీసులు వారిపై సెక్షన్ 109, 302 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments