Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాంబార్ టేస్టుగా లేదని చెల్లెలుపై కాల్పులు.. జైలులో చిప్పకూడు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (22:12 IST)
sambar
మద్యం తాగిన మత్తులో ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ఇంట్లో సాంబార్ రుచిగా చేయలేదన్న చిన్న సాకుతో.. తల్లి, సోదరిపై కాల్పులు జరిపారు. దీంతో వారు స్పాట్‌లోనే చనిపోయారు. ఈ అత్యంత దారుణ ఘటన కర్ణాటక జరిగింది. మృతులను సిద్ధాపుర్ తాలుకాలోని దోడ్​మణె గ్రామానికి చెందిన పార్వతీ నారాయణ హస్లార్​(42), ఆమె కుమార్తె రమ్యా నారాయణ హస్లార్​(19)గా పోలీసులు గుర్తించారు.
 
వివరాల్లోకి వెళ్తే.. పార్వతి కుమారుడు మంజునాథ హస్లార్​(24).. మద్యానికి విపరీతంగా బానిసయ్యాడు. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి తాగుడు మీదే ద్యాస ఉండేది. బుధవారం రాత్రి అన్నం వడ్డించిన సమయంలో… సాంబార్ రుచిగా లేదంటూ తల్లి, సోదరితో అతడు గొడవకు దిగాడు. 
 
వంట వండటం కూడా రావడం లేదు బూతులు తిట్టాడు. ఈ క్రమంలో తల్లి, సోదరి కూడా ఘాటుగా బదులివ్వడంతో.. కోపోద్రిక్తుడైన అతడు.. నాటు తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన సమయంలో మంజునాథ తండ్రి ఇంట్లో లేడని పోలీసులు చెప్పారు. మద్యం మత్తులో
 
దీనిపై సిద్ధాపుర్ పోలీస్ స్టేషన్​లో అతడు కంప్లైంట్ చేశాడని పేర్కొన్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. మద్యపానం వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఈ ఘటన కళ్లకు కట్టింది. ఇటు అయినవాళ్లని కోల్పోయి.. అతడు ఇకపై జైల్లో చిప్పకూడు తినాల్సిన పరిస్థితి మంజునాథకు వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments