Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాంబార్ టేస్టుగా లేదని చెల్లెలుపై కాల్పులు.. జైలులో చిప్పకూడు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (22:12 IST)
sambar
మద్యం తాగిన మత్తులో ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ఇంట్లో సాంబార్ రుచిగా చేయలేదన్న చిన్న సాకుతో.. తల్లి, సోదరిపై కాల్పులు జరిపారు. దీంతో వారు స్పాట్‌లోనే చనిపోయారు. ఈ అత్యంత దారుణ ఘటన కర్ణాటక జరిగింది. మృతులను సిద్ధాపుర్ తాలుకాలోని దోడ్​మణె గ్రామానికి చెందిన పార్వతీ నారాయణ హస్లార్​(42), ఆమె కుమార్తె రమ్యా నారాయణ హస్లార్​(19)గా పోలీసులు గుర్తించారు.
 
వివరాల్లోకి వెళ్తే.. పార్వతి కుమారుడు మంజునాథ హస్లార్​(24).. మద్యానికి విపరీతంగా బానిసయ్యాడు. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి తాగుడు మీదే ద్యాస ఉండేది. బుధవారం రాత్రి అన్నం వడ్డించిన సమయంలో… సాంబార్ రుచిగా లేదంటూ తల్లి, సోదరితో అతడు గొడవకు దిగాడు. 
 
వంట వండటం కూడా రావడం లేదు బూతులు తిట్టాడు. ఈ క్రమంలో తల్లి, సోదరి కూడా ఘాటుగా బదులివ్వడంతో.. కోపోద్రిక్తుడైన అతడు.. నాటు తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన సమయంలో మంజునాథ తండ్రి ఇంట్లో లేడని పోలీసులు చెప్పారు. మద్యం మత్తులో
 
దీనిపై సిద్ధాపుర్ పోలీస్ స్టేషన్​లో అతడు కంప్లైంట్ చేశాడని పేర్కొన్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. మద్యపానం వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఈ ఘటన కళ్లకు కట్టింది. ఇటు అయినవాళ్లని కోల్పోయి.. అతడు ఇకపై జైల్లో చిప్పకూడు తినాల్సిన పరిస్థితి మంజునాథకు వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

Anushka : అనుష్క శెట్టి ఫిల్మ్ ఘాటి సెకండ్ సింగిల్ దస్సోరా రిలీజ్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments